09-03-2025 06:53:48 PM
చేగుంట (విజయక్రాంతి): చేగుంట మండలం కొండాపూర్ గ్రామంలో పెద్ద పోత మైసవ్వ ఇటీవల కాలంలో మరణించిన విషయం తెలుసుకున్న దుబ్బక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు చేగుంట యువ నాయకుడు సండ్రుగు శ్రీకాంత్ వారి కుటుంబానికి 50 కిలోల బియ్యం, ఆర్దిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో కొండాపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బేగరి రమేష్, కత్తుల నర్సిములు, వడియారం ప్రభాకర్, పెద్ద పోత చెంద్రం, పోటెల్ బాలరాజు, సిద్దిరాములు, సహాదేవ్ తదితరులు పాల్గొన్నారు.