05-03-2025 08:44:16 PM
కామారెడ్డి (విజయక్రాంతి): తెలంగాణ యూనివర్సిటీ ప్రకటించిన డిగ్రీ సెమిస్టర్ 1, 3, 5 ఫలితాలలో సాందీపని డిగ్రీ కళాశాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలను సాధించి, అత్యుత్తమ ఉత్తీర్ణత శాతాన్ని నమోదు చేశారు. బుధవారం ప్రకటించిన ఫలితాలలో MSTCS మొదటి సంవత్సరం సెమిస్టర్ -1 విభాగంలో రిమ్ష మహీన్ 10 కి 10 SGPA, NZC మొదటి సంవత్సరం సెమిస్టర్ -1 విభాగంలో మ్యాదరి స్నేహ 10కి 10 SGPA, అఫీరా మాలిక్ 10కి గాను 9.84 SGPA, BCom తృతీయ సంవత్సరం సెమిస్టర్-5 విభాగంలో 10కి గాను 9.72 SGPA మార్కులను సాధించారు. యూనివర్సిటీ పరిధిలో మొదటి ర్యాంకును సాధించిన విద్యార్థులను కళాశాల డైరెక్టర్ ఆర్. హరిస్మరణ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ సాయిబాబు, అకాడమిక్ ప్రిన్సిపల్ మనోజ్ కుమార్, ఉపన్యాసకులు, విద్యార్థులను అభినందించారు.