హైదరాబాద్: సనత్నగర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (ఎస్హెచ్వో) ఇన్స్పెక్టర్ ఏ పురేందర్రెడ్డి సస్పెండ్ అయ్యారు. సస్పెండ్ చేస్తూ సైబరాబాద్ కమిషనర్ అవినాష్ మొహంతి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన మహిళ పట్ల పురేందర్రెడ్డి అసభ్య చాటింగ్ చేశాడు. దీంతో బాధితురాలు సైబరాబాద్ సీపీని ఆశ్రయించారు. సీఐ చేసిన చాటింగ్ ను ఆమె సీపీకి చూపించారు. అందంగా ఉన్నావు, చెప్పిన ప్లేస్ కి రావాలి అంటూ సీఐ మేసేజ్ లు అందులో ఉన్నాయి.