calender_icon.png 19 April, 2025 | 11:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంపత్ కు ఉగాది పురస్కారం!

14-04-2025 12:16:28 AM

కొత్తపల్లి,ఏప్రిల్13(విజయక్రాంతి): తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రతీ ఏటా ఇచ్చే ఉత్తమ జర్నలిస్ట్ ఉగాది పురస్కారానికి  కరీంనగర్ సీనియర్ కరస్పాండెంట్ జి. సంపత్ కుమార్ ఎంపికయ్యారు. 2024-25 సంవత్సరానికిగాను ఉత్తమ జర్నలిస్టుగా విజయవాడ వేదికగా పురస్కారాన్నీ సంపత్ కుమార్ కు ప్రకటించారు. శ్రేయోభిలాషులు, వివిధ పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు అభినందనలు తెలిపారు.