calender_icon.png 10 February, 2025 | 8:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒకే వ్యక్తి.. ఒకే పార్టీ

10-02-2025 12:58:11 AM

ఇదే మోదీ రహస్య ఎజెండా 

  1. హక్కుల రక్షణకు దక్షిణాది ఏకం కావాలి
  2. తెలంగాణను ఉత్తమంగా తీర్చిదిద్దుతున్నాం
  3. మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్
  4. సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): ఒకే దేశం-ఒకే ఎన్నిక నినాదం, ఒకే వ్యక్తి-ఒకే పార్టీ విధానం ప్రధాని నరేంద్రమోదీ రహస్య ఎజెండా అని, నియోజకవర్గాల పునర్విభజన మరో అంశమని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కుటుంబ నియంత్రణ విధానం తో పాటు ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే మెరుగైన సంక్షేమ పథకాలు చేపట్టినందుకు దక్షిణాదిని శిక్షిస్తున్నారా అని ఆయ న ప్రశ్నించారు.

తెలంగాణ రైజింగ్ కేవ లం నినాదం మాత్రమే కాదని, అది నాలుగు కోట్ల రాష్ట్ర ప్రజల స్వప్నమని స్పష్టం చేశారు. తెలంగాణను దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అత్యుత్తమంగా నిలపాలని తాను ఆకాంక్షిస్తున్నట్టు చెప్పా రు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను రక్షించుకునేందుకు దక్షిణాది రాష్ట్రాలు ఏకం కావాల్సిన అవసరం వచ్చిందన్నా రు.

మలయాళీ దినపత్రిక మాతృభూమి యాజమాన్యం ఆధ్వర్యంలో కేరళ రాజధాని తిరువనంతపురంలో ఆదివారం ఏర్పాటు చేసిన ‘మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్’ సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. 60 ఏళ్ల కలను నెరవేర్చినందుకు ఇక్కడి ప్రజలు సోనియా గాంధీని ఎంతో అభిమానిస్తున్నారు.

బీఆర్‌ఎస్ పదేళ్ల కాలంలో చేసిందేమీ లేదు. తెలంగాణ జీడీపీ ప్రస్తుతం సుమారు 200 బిలియన్ యూఎస్ డాలర్లుగా ఉంది. 2035 నాటికి దాన్ని ట్రిలియన్ యూఎస్ డాలర్లుగా మార్చాలనుకుంటున్నాం. రాష్ట్రాన్ని హైదరాబాద్ కోర్ అర్బన్, సెమీ అర్బన్, రూరల్ జోన్లుగా విభజించాం. 160 కిలోమీటర్ల పొడవైన ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని కోర్ అర్బన్ ఏరియాలో 1.2 కోట్ల ప్రజలు నివసిస్తున్నా రు.

ఈ ప్రాంతం సాఫ్ట్‌వేర్, ఫార్మా రంగాలకు కేంద్రంగా ఉంది. చార్మినార్, ఓఆర్‌ఆర్ పరిధిలోని ఈ కోర్ అర్బన్ ఏరియాను సర్వీస్ సెక్టార్లతో వందశాతం నెట్ జీరోగా మార్చనున్నాం’ అని సీఎం తెలిపారు. 

అత్యుత్తమ నగరంగా హైదరాబాద్.. 

హైదరాబాద్‌ను ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా తీర్చిదిద్దేందుకు అనేక కార్య క్రమాలు చేపడుతున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. ‘దేశంలోని ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్ను వంటి నగరాలతో కా కుండా ప్రపంచంలోని ముఖ్య నగరాలైన న్యూయార్క్, లండన్, సింగపూర్, టోక్యో, సియోల్ వంటి నగరాలతో పోటీపడేలా భాగ్యనగరాన్ని తీర్చిదిద్దాలని భావిస్తున్నాం.

30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తు న్నాం. దీన్ని భారతదేశంలోని పూర్తి హరిత, పరిశుభ్రమైన, అత్యుత్తమమైన నగరంగా తీర్చిదిద్దనున్నాం. యువత కోసం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్మిస్తు న్నాం. ఈ ఏడాది దావోస్‌లో జరిగిన ప్రపం చ ఆర్థిక వేదిక సదస్సులో నేను పాల్గొన్నా.

రూ.1,82,000 కోట్లకుపైగా పెట్టుబడులను తెలంగాణకు తీసుకురాగలిగాం. గతేడాది రూ.40 వేల పెట్టుబడులు వచ్చాయి. బీఆర్‌ఎస్ పదేళ్ల పాలనాకాలంలో రూ.25 వేల కో ట్ల పెట్టుబడులను కూడా సాధించలేకపోయింది’ అని వివరించారు. 

ఉత్పత్తి జోన్‌గా సెమీ అర్బన్ ఏరియా

‘ఓఆర్‌ఆర్, -ఆర్‌ఆర్‌ఆర్ మధ్య ఉన్న సెమీ అర్బన్ ఏరియాను ఉత్పత్తి జోన్‌గా మార్చబోతున్నాం. ఔషధాలు, విత్తనాల ఉత్పత్తిలో తెలంగాణ ముందుజలో ఉంది. వాటికి అదనంగా ఎఫ్‌ఎంసీజీ, రక్షణ, రాకెట్లు, స్పేస్, ఎలక్ట్రిక్ వాహనాలు, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో ముందు వరుసలో నిలవాలనుకుంటు న్నాం. భారతదేశానికి డాటా సెంటర్ హబ్ గా, పంప్ స్టోరేజీ హబ్‌గా తెలంగాణ నిలవనుం ది.

త్రిపుల్ ఆర్ వెలుపల నుంచి రాష్ట్ర సరిహద్దుల వరకు ఉన్న గ్రామాలను మా ర్చాలనుకుంటున్నాం. గ్రామాల్లోనూ అత్యుత్తమ వసతులు కల్పిస్తాం. రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా ఇస్తున్నాం. రైతులకు ఎకరాకు రూ.12 వేలు రైతు భరోసా, భూమి లేని కుటుంబాలకు ఏడాదికి రూ.12 వేలు, పంటలకు కనీస మద్దతు ధరతో పాటు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తున్నాం’ అని సీఎం పేర్కొన్నారు.

కేవలం మౌలిక వసతుల వృద్ధితోనే తెలంగాణ రైజింగ్ కాదని, రైతులు, మహిళలు, యువ త, పిల్లలు, వ యోధికులు ఇలా అందరి విషయంలోనూ తమ ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. 

దక్షిణాదిపై కేంద్రం చిన్నచూపు 

సమగ్ర కులగణన సర్వే నిర్వహించి అ సెంబ్లీలో ప్రవేశపెట్టామని, జనాభా దా మాషా ప్రకారం వనరులను సమకూరుస్తామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం మాదిగ సామాజికవర్గం 30 ఏళ్లుగా పోరాడుతోందని, సు ప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు వర్గీకరణ చేపట్టాలని ఫిబ్రవరి 4న ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి తీర్మానించినట్టు చెప్పారు.

అందుకే ఫిబ్రవరి 4వ తేదీని సా మాజిక న్యాయ దినోత్సవంగా జరుపుకోనున్నట్లు సీఎం చెప్పారు. ‘కేంద్ర ప్రభుత్వ తా జా ఆర్థిక సర్వే నివేదిక ప్రకారం అతి తక్కువ ద్రవ్యోల్బణం ఉన్న రాష్ర్టం తెలంగాణ. గ్లోబ ల్ ఏఐ యూసేజ్ నివేదిక ప్రకారం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగంలో మేం ప్రథమ స్థానంలో ఉన్నాం. తలసరి ఆదాయంలోనూ మేం ముందున్నాం’ అని సీఎం పేర్కొన్నారు.

హైదరాబాద్ అభివృద్ధితోనే రైజింగ్ సాధ్యం..  

‘హైదరాబాద్ పర్యావరణ సుస్థిరతకు మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు చేపట్టాం. గత యాభై ఏళ్లుగా కాలుష్య కోరల్లో చిక్కి మూసీ కనుమరుగయ్యే స్థితికి చేరింది. మా ప్రభుత్వం మూసీకి పూర్వవైభవం తేవాలనుకుంటోంది. గోదావరి నీటిని మూసీలో కలపడం ద్వారా త్రివేణి సంగమంగా మార్చనున్నాం. అక్కడే 200 ఎకరాల్లో గాంధీ సరోవర్‌ను నిర్మిస్తున్నాం. దక్షిణాది రాష్ట్రాల్లో తీరప్రాంతం లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ.

ఈ నేపథ్యంలో మేం డ్రై పోర్ట్ నిర్మించనున్నాం. హైదరాబాద్ వృద్ధి చెందితేనే తెలంగాణ రైజింగ్ సాధ్యమవుతుంది. మేం రీజినల్ రింగ్ రోడ్డును, రీజినల్ రింగ్ రైల్వే లైన్‌ను నిర్మించబోతున్నాం. ఈ రెండింటిని రేడియల్ రోడ్ల ద్వారా కలపనున్నాం. మేం ఇటీవల ఎనర్జీ పాలసీని విడుదల చే శాం. ఈవీలపై ఉన్న అన్ని పన్నులు తొలగిం చాం. ఈవీల అమ్మకాల్లో దేశంలోనే తెలంగాణ తొలి స్థానంలో ఉంది’ అని తెలిపారు.