ప్రారంభించిన జస్టిస్ సుజయ్పాల్
హైదరాబాద్, ఆగస్టు 8 (విజయక్రాంతి): హైకోర్టు ఆవరణలో బాలల సంరక్షణ కేంద్రంలో పిల్లలు తయారు చేసిన చేనేత వస్తువుల విక్రయ కేంద్రాన్ని హైకోర్టు న్యాయమూర్తి, తెలంగాణ న్యాయసేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ జస్టిస్ సుజయ్పాల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జువైనల్ జస్టిస్ కమిటీ చైర్పర్సన్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మౌసమీ భట్టాచార్య, హైకోర్టు న్యాయమూర్తులు, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి పంచాక్షరి, పరిపాలనాధికారి జీ కళార్చన, రిజిస్ట్రార్లు, బాలల సంరక్షణ, దిద్దుబాటు సేవల డైరెక్టర్ ఏ కాంతి వెస్లీ తదితరులు పాల్గొన్నారు. న్యాయమూర్తులు పిల్లలను ఆశీర్వదించి, వారు తయారు చేసిన వస్తువులను కొనుగోలు చేసి, వారిలో మార్పును ప్రోత్సహించారు.