న్యూఢిల్లీ, ఆగస్టు 22: అదానీ సిమెంట్లో 2.84 శాతం వాటాను అదానీ గ్రూప్ విక్రయిస్తున్నది. షేరు కు రూ.600 ధరతో 7 కోట్ల షేర్లను విక్రయించి అదానీ గ్రూప్ రూ. 4,200 కోట్లు సమీకరిస్తున్నట్టు ఈ లావాదేవీ నిర్వహిస్తున్న బ్యాంకర్ జారీచేసిన టెర్మ్షీట్ తెలిపింది. గురువారం అంబూజా సిమెంట్ క్లోజింగ్ ధర రూ.633తో పోలిస్తే 5 శాతం డిస్కౌంట్తో ఈ లావాదేవీ స్టాక్ ఎక్సేంజీల్లో బ్లాక్డీల్స్ రూపంలో శుక్రవారం జరుగుతుంది.