ఐక్య విద్యార్ధి సంఘాల నాయకులు
మంచిర్యాల, (విజయక్రాంతి): మంచిర్యాల పట్టణంలోని సాయికుంట చెరువును కబ్జాదారుల నుంచి కాపాడాలని ఐక్య విద్యార్ధి సంఘాల నాయకులు కోరారు. గురువారం మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ మారుతీ ప్రసాద్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... వ్యవసాయానికి ఉపయోగపడాల్సిన చెరువులను రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల సహకారంతో రియల్ వ్యాపారులు కబ్జాలకు పాల్పడుతున్నారన్నారు. సంబంధిత అధికారులు విచారణ చేపట్టి కబ్జాకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చెరువులను కాపాడాలని డిమాండ్ చేశారు. వినతి పత్రం అందజేసిన వారిలో ఐక్య విద్యార్థి సంఘం నాయకులు షేక్ సల్మాన్ పాపా, జుమ్మిడి గోపాల్, పూరెల్ల సతీష్, రేగుంట క్రాంతికుమార్ తదితరులు పాల్గొన్నారు.