'సత్యం సుందరం' సినిమాపై సాయిధరమ్ తేజ్ ట్వీటర్ లో పోస్టు చేశారు. కార్తి- అరవింద్ స్వామి కీలక పాత్రలో నటించిన సినిమా 'మెయ్యజగన్'. సత్యం సుందరం పేరుతో తెలుగులో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకోవాలని సాయిధరమ్ తేజ్ పోస్టు చేశారు. దీనిపై స్పందించిన కార్తి బ్రదర్.. ప్రేమ, ఆప్యాయతతో మీరు ఎల్లప్పుడూ మంచి మనసు చాటుకుంటారు. మీ విషెస్ కు ధన్యవాదాలు అని పేర్కొన్నారు. '96' ఫేమ్ ప్రేమ్ కుమార్ డైరెక్షన్ చేసిన ఈ సినిమా ఈ నెల 28న థియేటర్స్ లోకి రానుంది. సత్యం సుందరం చిత్రానికి సూర్య, జ్యోతిక నిర్మాతలుగా వ్యవహరించారు.