calender_icon.png 12 October, 2024 | 12:55 PM

వరదల్లో కొట్టుకుపోయిన సాయి మృతదేహం లభ్యం

03-09-2024 05:12:19 PM

ఖమ్మం,(విజయక్రాంతి): గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు టేకులపల్లి మండలం నుండి లచ్చగూడెం గ్రామానికి చెందిన దొడ్డ సాయి, కోరం వెంకటేశ్వర్లు మేడారం ఫంక్షన్ కి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఆదివారం రాత్రి ఆళ్లపల్లి మండలం రాయపాడు గ్రామం వద్ద కిన్నెరసాని బ్రిడ్జిపైన ఉగ్రరూపంతో వరద ప్రవాహం వచ్చింది. ఈ వరదలో ద్విచక్ర వాహనంతో దొడ్డ సాయి, కోరం వెంకటేశ్వర్లు కొట్టుకుపోయారు. బంధువులు ఇచ్చిన సమాచారంతో పాలు వాడిన మొబైల్ నెంబర్ ఈఎంఐ సిమ్ కార్డుపై సిగ్నల్ లో పోలీసులు పరిశీలించారు.  రాయపాడు వద్ద కిన్నెరసాని వాగు వద్ద వరకే సిగ్నల్ చూపించడంతో మంగళవారం ఉదయం ఎన్ డీఆర్ ఎప్ బృందంతో ఆళ్లపల్లి ఎస్ఐ రతీష్, టేకులపల్లి పోలీస్ సిబ్బందితో కలిపి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో బంగారు చెలక చింతకుంట గ్రామం వద్ద దొడ్డ సాయి అనే మృతదేహం లభ్యమైనది. వెంకటేశ్వర్లు మృతదేహం కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.