calender_icon.png 30 September, 2024 | 1:02 PM

సాహితీ ఇన్‌ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణ అరెస్ట్

30-09-2024 02:39:21 AM

ప్రీలాంచ్ పేరిట రూ.1,800 కోట్ల మోసం 

సీసీఎస్‌లో నమోదైన కేసు ఆధారంగా అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు

హైదరాబాద్, సెప్టెంబర్ 29(విజయక్రాంతి): ప్రీలాంచ్ పేరిట వేలాది మంది కస్టమర్లను మాయమాటలతో నమ్మించి సుమారు రూ.1,800 కోట్ల కు పైగా మోసానికి పాల్పడిన సాహితీ ఇన్‌ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణను ఆదివారం ఈడీ అధికారులు అరెస్ట్ చేశా రు. గతంలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీసీఎస్‌లో నమోదైన కేసు ఆధారంగా ఈడీ అదుపులోకి తీసుకుంది. కాగా ఇప్పటికే సీసీఎస్ పోలీసులు సాహితీ ఇన్‌ఫ్రాకు సంబంధించిన రూ.200 కోట్లను అటాచ్ చేశారు.