ప్రీలాంచ్ పేరిట రూ.1,800 కోట్ల మోసం
సీసీఎస్లో నమోదైన కేసు ఆధారంగా అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు
హైదరాబాద్, సెప్టెంబర్ 29(విజయక్రాంతి): ప్రీలాంచ్ పేరిట వేలాది మంది కస్టమర్లను మాయమాటలతో నమ్మించి సుమారు రూ.1,800 కోట్ల కు పైగా మోసానికి పాల్పడిన సాహితీ ఇన్ఫ్రా ఎండీ లక్ష్మీనారాయణను ఆదివారం ఈడీ అధికారులు అరెస్ట్ చేశా రు. గతంలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీసీఎస్లో నమోదైన కేసు ఆధారంగా ఈడీ అదుపులోకి తీసుకుంది. కాగా ఇప్పటికే సీసీఎస్ పోలీసులు సాహితీ ఇన్ఫ్రాకు సంబంధించిన రూ.200 కోట్లను అటాచ్ చేశారు.