29-01-2025 12:27:10 AM
పుణే: ఐటీఎఫ్ మహిళల టెన్నిస్ టోర్నీ లో తెలుగు తేజాలు సహజ యమలపల్లి, శ్రీవల్లి భమిడిపాటి అదరగొట్టారు. తొలి రౌండ్లో విజయాలు సాధించిన ఈ ఇద్దరు రెండో రౌండ్కు దూసుకెళ్లారు. మంగళవా రం జరిగిన మహిళల సింగిల్స్ తొలి రౌండ్ లో సహజ 6 (4/7), 6 6 జపాన్కు చెందిన నాహో సాటోను ఓడించింది. మరో మ్యాచ్లో శ్రీవల్లి 6 6 తో అమెరికాకు చెందిన ఆనా స్మిత్ను చిత్తు చేసింది. రెండో రౌండ్లో లియలియాతో సహజ, పన్నాతో శ్రీవల్లి ఆడనున్నారు.