హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వైభవంగా సద్దుల బతుకమ్మ సంబురాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై తెలంగాణ ప్రభుత్వం సద్దుల బతుకమ్మ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహిస్తోంది. అతివలు తీరొక్క పూలను పేర్చి బతుకమ్మల చుట్టూ ఆడిపాడుతూ సంబురాలు చేసుకుంటున్నారు. సద్దుల బతుకమ్మ ఊరేగింపు అనంతరం లేజర్ షో, క్రాకర్ షో నిర్వహించారు.
వేలాది మంది మహిళలు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అంటూ ఆడిపాడుతున్నారు. వేలాది మంది మహిళలతో మంత్రి సీతక్క, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ, తదితరులు పాల్గొన్నారు. రాత్రి 11 గంటల వరకు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పూలను పూజిస్తూ, చెరువులను ఆరాధిస్తూ బతుకమ్మ పండుగ జరుపుకుంటున్న తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మంత్రి సీతక్క సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.