calender_icon.png 28 October, 2024 | 10:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సదరు ఉత్సవాలకు భారీ దున్నలు సిద్ధం

28-10-2024 08:28:31 PM

నగరంలో సందడి చేయనున్న నేషనల్ ఛాంపియన్ షిప్ దున్నలు

హరియానా, గుజరాత్ నుంచి నగరానికి చేరిక 

ముషీరాబాద్,(విజయక్రాంతి): దీపావళి పర్వదినం సందర్భంగా యాదవులు నగరంలో నిర్వహించే సదరు ఉత్సవాలలో హరియానా, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన భారీ ఆకారంలో ఉన్న దున్నలు సదరులో అలరించనున్నాయి. నవంబర్ 2న నగరంలో నిర్వహించే సదరు ఉత్సవాలలో దున్నలు పాల్గొనే విధంగా ముషీరాబాద్కు చెందిన అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బీఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి ఎడ్ల హరిబాబు యాదవ్, హరియానా రాష్ట్రం నుంచి ప్రత్యేక వాహనంలో ముషీరాబాద్కు భారీ ఆకారంలో ఉన్న గోలు(7 ఏండ్లు) దున్నా, షేర్(8 ఏండ్లు), గుజరాత్కు చెందిన శ్రీకృష్ణ(7 ఏండ్లు), విదాయక్(8 ఏండ్లు) దున్నలను తీసుకువచ్చారు. ఈ దున్నలు భారీ ఆకారంలో ఉండడంతో అందరిని ఆకట్టుకుంటున్నాయి.

దున్నల ప్రత్యేకత...

ఆరు అడుగుల ఎత్తు, 1800 కిలోల బరువు ముర్రా జాతికి చెందిన గోలు దున్నా నేషనల్ ఛాం పియన్ షిప్ పశువుల ప్రదర్శన పోటీలలో రెండు సార్లు చాంపియన్ షిప్ విజేతగా నిలిచింది. రూ.5లక్షల అవార్డు సైతం పొందింది. దీని యజమాని నరేందర్ సింగ్ ముర్రా జాతిని ప్రోత్సహిస్తూ ప్రత్యేకంగా పెంచడంతో ఆయనను అభినందిస్తూ రాష్ట్ర పతి, ప్రధాని నరేంద్ర మోదీ చేతులమీదుగా పద్మశ్రీ అవార్డును సైతం పొందారు. షేర్ దున్నా భారీ ఆకారంలో ఉండడంతోపాటు పశుమేళా చాంపియన్ షిప్ పోటీలలో పలు మార్లు అవార్డులు పొందింది.

గుజరాత్ కు చెందిన శ్రీకృష్ణ దున్నా సైతం పశుమేళ ప్రదర్శనలో ప్రోత్సాహకార బహుమతులను పొందింది. విదాయక్ దున్నా 1700 కిలోల బరువుతో, 6 అడుగుల ఎత్తు, గం భీర అకారంలో ఉండడంతోపాటు ప్రత్యేక అవార్డులను పొందింది. ఈ దున్నలకు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో రెండు సార్లు స్నానం చేయిస్తారు. 20లీటర్ల పాలు తాగించడం తోపాటు యాపిల్స్, డ్రైఫ్రూట్స్, అరటిపండ్లు, బెల్లం, తదితర పండ్లను ఆహారంగా అందజేసారు.