13-04-2025 01:44:21 AM
ప్రకృతి, పర్యావరణం లేనిదే మానవ మనుగడ లేదనే సిద్ధాంతాన్ని బలంగా నమ్మిన వ్యక్తి పద్మశ్రీ వనజీవి దరిపెల్లి రామయ్య అని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఒక వ్యక్తిగా మొక్కలు నాటడం ప్రారంభించి, సమాజాన్నే ప్రభావితం చేసిన గొప్ప మనీషిగా ఎదిగారన్నారు. వారి మరణం తెలంగాణ సమాజానికి తీరని లోటు అని, కుటుంబ సభ్యులకు తీవ్ర సంతాపం తెలిపారు. పర్యావరణ రక్షణకు పాటుపడుతూ తన జీవితాన్ని అంకితం చేసిన రామయ్య ఆత్మకు నివాళి అర్పిస్తున్నట్టు సీఎం తెలిపారు.