మంచిర్యాల, జూలై 21 (విజయక్రాంతి) : బెల్లంపల్లిలో ఇటీవల నిర్వహించిన తైక్వాండో రాష్ట్ర స్థాయి మీట్లో సబ్ జూనియర్ కేటగిరీలో మంచిర్యాల ది హ్యాపి స్కాలర్ స్కూల్ విద్యార్థి కన్నం కృషిత్ ద్వితీయ స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ సాధించాడు. ఈ సందర్భంగా కృషిత్ను ఆదివారం పాఠశాల కరస్పాండెంట్ సీహెచ్ విక్రంరావు, అకాడమిక్ ఇన్చార్జి శ్వేత, ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు.