జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య
ముషీరాబాద్, అక్టోబర్ 7: బీఈడీ అభ్యర్థులతోనే ఎస్ఏ పోస్టు లు భర్తీ చేయాలని మాజీ ఎంపీ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణ య్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం విద్యానగర్లోని బీసీ భవన్లో నిరుద్యోగ జేఏసీ చైర్మన్ నీల వెంకటేశ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..
సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో డీఈడీ వారికి ఎస్జీటీ పోస్టులు భర్తీ చేస్తున్నపుడు కేవలం బీఈడీ వారితోనే వంద శాతం డీఎస్సీ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డుని.. బోర్డ్ ఆఫ్ ప్రైమరీ ఎడ్యుకేషన్, బోర్డు ఆఫ్ సెకెండరీ ఎడ్యుకేషన్గా విడదీయాలని కోరారు. ఈ సమావే శంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జకృష్ణ, నాయకులు.. జిల్లపల్లి అంజీ, నందగోపాల్, రాజేందర్, నర్సింహా గౌడ్, రవికుమార్ యాదవ్, ఉదయ్ నేత, సుమన్ తదితరులు పాల్గొన్నారు.