calender_icon.png 26 October, 2024 | 2:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కన్నడ ప్రజలకు చేరువలో ఆర్‌వీ టూర్స్ అండ్ ట్రావెల్స్

26-10-2024 12:14:19 AM

గంగానగర్‌లో నూతన కార్యాలయం ప్రారంభం

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 25 (విజయక్రాంతి): దక్షిణ భారతదేశంలోని ప్రజలకు పర్యాటక రంగంలో దేశీయ, అంతర్జాతీయ ప్యాకేజీలు అందించడంలో అనుభవం గల ఆర్‌వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ కన్నడ ప్రజలకు చేరువైంది. శుక్రవారం కర్ణాటకలోని గంగానగర్‌లో ఆర్‌వీ సంస్థ నూతన కార్యాలయం ప్రారంభమైంది.

కార్యక్రమంలో ప్రముఖ నటి ప్రణీతసుభాశ్, ఆర్‌వీ సంస్థ అధినేత రావ్మ్రణ, హెచ్‌ఆర్ సురేఖ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్‌వీ రమణ మాట్లాడుతూ.. తమ సంస్థ ఎన్నో ఓపెనింగ్ ఆఫర్స్‌ను కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 31లోపు బుకింగ్ చేసుకునే వారికి బ్యాంకాక్ కాశీ సింగపూర్ మలేషియా రూ.1,06,000, దుబాయ్ ప్యాకేజీలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. 24 ఏళ్లుగా తమ సంస్థ పర్యాటక రంగంలో సేవలందిస్తోందని చెప్పారు.