20-04-2025 09:18:37 AM
అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanams)లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఆదివారం కావడంతో వెంకన్న దర్శనానికి భక్తులు బారులు తీరారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని కంపార్టుమెంట్స్ అన్ని నిండిపోయి వెలుపల క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు. తిరుమలలో టోకేన్లు లేని భక్తుల సర్వదర్శనానికి(Tirumala Sarva Darshan) 18 గంటల సమయం పడుతోందని ఆలయ అధికారులు వెల్లడించారు. నిన్న 78,821 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 33,568 మంది భక్తులు శనివారం స్వామివారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.36 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు ప్రకటించారు.