14-02-2025 12:00:00 AM
పాల్వంచ, ఫిబ్రవరి 13 ః రాజ్యాంగం పై, ప్రజాస్వామ్యంపై గౌరవంలేని పాలకు ల చేతిలో దేశం మగ్గుతోందిని సీపీఐ రాష్ర్ట కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. గురువారం పాల్వంచ పట్టణ పరిధిలోని వాసవి బాంకె ట్ హాల్లో సీపీఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమితి సభ్యులు సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కూనంనేని మాట్లాడుతూ ప్రతిపక్ష పాలిత ప్రభుత్వాలను కూల్చేసే పనిలో కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఉందని, అధికారం కోసం బీజేపీ ఎంతకైనా తెగిస్తున్నారుని, అందులో భాగంగానే అక్రమ కేసులు పెట్టీ సీబీఐ, ఈడి ద్వారా దాడులు జరుపుతూ ప్రతి పక్షాలను భయపెడుతున్నారుని విమర్శించారు.
మావోయిస్టులును మార్చ్ వర కు లేకుండా చేస్తాం అని అమిత్ షా ప్రకట న వెనక ఆంతర్యం ఏంటి అని, ప్రశ్నించే గొంతుకులను నలిపివేయటమే బిజెపి ఎజెండాగా పెట్టుకుందని విమర్శించారు. పేద ప్రజలు, కష్టజీవులు, కర్షకులు, కార్మికుల పార్టీ సిపిఐ అని, సుదీర్ఘ పోరా టాలు, త్యాగాలతో నిర్మితమైన ఎర్ర జెండా పార్టీకి ఎదురులేదని, ప్రజలకు ఏ కష్టమొ చ్చినా గుర్తొచ్చేది ఎర్ర జెండానేని అన్నారు. సమ సమాజ స్థాపన-సోసిలిస్టు రాజ్య సాధ నే కమ్యూనిస్టుల లక్ష్యం అని, అందుకోసం ఎటువంటి త్యాగాలకైనా వెనకాల పోమని స్పష్టం చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే జిల్లా వ్యాప్తంగా సిపిఐ శత వసంతాల వేడుకలను ఘనంగా నిర్వ హించాలని, శతవసంతాల వేడుకలతో పార్టీ ప్రజా సంఘాలను మరింత బలోపే తం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్య క్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా, రాష్ర్ట కార్యవర్గ సభ్యులు బి.అయో ధ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు ముత్యాల విశ్వనాథం, సర్ రెడ్డి పుల్లారెడ్డి, సలీం, కే.సారయ్య, కల్లూరి వెంకటేశ్వరరావు, కమటం వెంకటేశ్వర్లు, మున్నా లక్ష్మికు మారి, నారాటి ప్రసాద్, సలిగంటి శ్రీనివా స్, రేసు ఎల్లయ్య, దేవరకొండ శంకర్, పట్టణ మండల కార్యదర్శులు వీసంశెట్టి పూర్ణచంద్రరావు, వాసిరెడ్డి మురళి, భూక్య దస్రు, బంధం నాగయ్య, రాంచందర్, సుధాకర్, రామకృష్ణ, సతీష్, బుర్ర కేశవ రావు, నారాయణ, యూసుఫ్, ధర్మ, గోగ్గి ల కృష్ణ, జిల్లా సమితి సభ్యులు, ప్రజా సంఘాల జిల్లా బాధ్యులు పాల్గొన్నారు.