calender_icon.png 28 October, 2024 | 8:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీఐ కమిషనర్లను వెంటనే నియమించాలి

28-10-2024 12:16:53 AM

ముషీరాబాద్, అక్టోబర్ 27(విజయక్రాంతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమా చార హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ కోరారు. ఈ మేరకు ఆదివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతూ ఆర్టీఐ కమిషనర్లు కమిషనర్లు లేక వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.

ప్రభుత్వం వెంటనే ఆర్టీఐ కమిషన ర్లను నియమించాలని కోరారు. సమాచార హక్కు చట్టాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆవిర్భావ దినోత్సవాలను అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎలిగెండ్ల వెంకటేశ్, తెలుగు సినిమా హీరో కిరణ్, ఫిలిం అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జీవీఆర్, బీజేవైంఎం రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు చింతల రాఘవేందర్, మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు సూర స్రవంతి, ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేశ్, గుండెల రాయుడు పాల్గొన్నారు.