రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
నిజామాబాద్లో ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభం
నిజామాబాద్, అక్టోబర్ 4 (విజయక్రాంతి): నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల్లోకి తీసుకువచ్చామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. నిజామాబాద్లో 14 ఎలక్ట్రిక్ బస్సులను బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణతో కలిసి శుక్రవారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీని నిర్లక్ష్యం చేసిందన్నారు. ప్రజలకు కాలుష్యరహిత సమాజం అందించాలన్న ధ్యేయంతో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నట్టు పొన్నం తెలిపారు.