calender_icon.png 19 April, 2025 | 3:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథని నుండి భద్రాచలంకు ఆర్టీసీ స్పెషల్ బస్సు

05-04-2025 12:00:00 AM

మంథని డిపో మేనేజర్ శ్రావణ్ కుమార్

మంథని మార్చి 04 (విజయక్రాంతి) : శ్రీ రామనవమి కళ్యాణోత్సం కోసం మంథని నుండి భద్రాచలం వరకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించినట్లు మంథని డిపో మేనేజర్ శ్రావణ్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆర్టీసీ ప్రత్యేక బస్సు శనివారం మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి, ఆదివారం కల్యాణోత్సవం తర్వాత సాయంత్రం 4 గంటలకు తిరిగి మంథని కి బయలుదేరుందని పేర్కొన్నారు.

దీనికి ఫుల్ టికెట్ రూ. 450 రూపాయలు హాఫ్ టికెట్ రూ. 225 రూపాయలు గా ఉంటుందని తెలియజేశారు. ఈ బస్సు ప్రయాణంలో మహిళలకు మహాలక్షి పథకం ఉచిత బస్సు ప్రయాణం వర్తించదనీ తెలిపారు. ఈ బస్సు సౌకర్యం భక్తులు సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ కోరారు.