04-04-2025 09:16:22 PM
హుజురాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ ఆర్టీసీ రిటైర్మెంట్ కార్మిక సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ధర్నాలో భాగంగా కరీంనగర్ జిల్లా హుజురాబాద్ డిపోలో శుక్రవారం డిపో గేటు ముందు రిటైర్డ్ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... 2017 లో సవరించిన రెండు పే స్కేలు ఏరియర్స్, డీఎ ఎరియర్స్, 2022 నుంచి అందవలసిన లీవ్ ఇన్క్యాస్మెంటు బకాయిలు, సూపర్ లగ్జరీలో వృద్ధులైన భార్యాభర్తలకు ఫ్రీ ప్రయాణం, మరణించిన రిటైర్మెంట్ కార్మికుల దహన సంస్కార్లకు అదే రోజు రూ.30 వేలు అందించాలన్నారు. 30, 35, 40 ఏళ్లు ప్రజలకు సేవలందించి రిటైర్ అయిన వృద్ధ కార్మికులు అనారోగ్యానికి గురైన వారిని ఇబ్బందులకు గురి చేయకూడదని ఎండీ డౌన్ డౌన్.. మేనేజ్మెంట్ డౌన్ డౌన్ అంటూ నిరసన తెలిపారు. అనంతరం సూపరిండెంట్ సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రిటైర్మెంట్ సూపర్డెంట్ వివిఆర్ రెడ్డి, ఎల్.సారయ్య, శుభ వర్ధన్, ప్రభాకర్ రెడ్డి, మార్త రవీందర్, వేల్పుల ప్రభా,కర్ పి ఎల్ రావు, వీడి రెడ్డి,పీ ఎస్ రెడ్డి, ఈవిఆర్ నరసయ్య, జి.ఎం.రెడ్డి. తో పాటు తదితరులు పాల్గొన్నారు.