18-12-2024 12:00:00 AM
మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం ద్వారా ఎంతో మేలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అదే సహృదయంతో ప్రయాణికుల కష్టాలుకూడా తీర్చాలి. డిమాండ్ ఉన్న రూట్లలో బస్సులు నడపాలని చాలా కాలంగా విజ్ఙప్తులు చేస్తున్నా ఆర్టీసీ అధికారులు స్పందించడం లేదు. కొన్ని రూట్లలో బస్సులు చాలక ప్రయాణికులు ఫుట్బోర్డ్పై నిలబడి అప్పుడప్పుడూ ప్రమాదాల బారిన పడుతున్నారు. డిపోలకు చాలినన్ని బస్సులు మంజూరు చేయాలి. సాగర్, గద్వాల