హైదరాబాద్, సెప్టెంబర్ 30 (విజయక్రాంతి): కార్మికుల చారిత్రాత్మక సమ్మె ఈ నెల 5 నాటికి ఐదేండ్లు పూర్తిచేసుకొనున్న సందర్భంగా ఆనా టి కార్మికుల పోరాట స్ఫూర్తిని, ప్రాణాలను బలిదానం చేసిన ఆర్టీసీ అమర వీరుల త్యాగాలను స్మరించుకుంటూ ‘ఆర్టీసి అమరవీరుల సంస్మరణ దినం’ గా పాటిస్తున్నట్టు జేఏసీ చైర్మన్ ఈదు రు వెంకన్న, వైస్ చైర్మన్ థామస్రెడ్డి, కన్వీనర్ మౌలానా తెలిపారు.
సకల జనుల సమ్మెలో సత్తా చాటి ఆర్టీసీ కార్మికులు తమ హక్కుల పరిరక్షణ, న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి 55 రోజుల సమ్మె 32 మంది కార్మికు ల ఆత్మబలిదానంతో అపజయంతోనే ముగిసిందని సోమవారం ఒక ప్రకటనలో ఆవేదన వ్యక్తంచేశారు. ఆర్టీసీలో ని అన్ని యూనిట్లలలో అక్టోబర్ 5న శ్రద్ధాంజలి ఘటించాలని జేఏసీ నిర్ణయించిందని చెప్పారు.