హైదరాబాద్, సెప్టెంబర్ 22 (విజయక్రాంతి): 29 కార్మిక చట్టాల స్థానంలో బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలన్న జాతీయ కార్మిక సంఘాల పిలుపు మేరకు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల్లో బ్లాక్ డే నిర్వహించే ఆర్టీసీ కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ ఎం.థామస్ రెడ్డి, కన్వీనర్ ఎండీ మౌలానా సంయుక్త ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై ఆర్టీసీ కార్మికుల పోరాటం కొనసాగుతుందని వెల్లడించారు.