calender_icon.png 28 October, 2024 | 2:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పల్లెపల్లెకు ఆర్టీసీ బస్సులు నడపాలి

13-08-2024 03:35:10 AM

రవాణాశాఖ మంత్రికి ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి వినతి

నల్లగొండ, ఆగస్టు 12 (విజయక్రాంతి): మునుగోడు నియోజకవర్గంలోని పల్లెపల్లెకూ ఆర్టీసీ బస్సును నడపాలని కోరుతూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌కు విజ్ఞప్తిచేశారు. సోమవారం హైదరాబాద్‌లో మంత్రిని కలిసిన ఎమ్మెల్యే.. వినతిపత్రం అందజేశారు. మునుగోడు, చండూరు, చౌటుప్పల్ బస్టాండ్లను ఆధునీకరించాలని కోరారు. నియోజకవర్గ వ్యాప్తంగా 21 రూట్లలో బస్సులు నడిపితే రవాణా అనుసంధానం పెరుగుతుందని తెలిపారు. సానుకూలంగా స్పందించిన మంత్రి అనుగుణంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.