27-02-2025 09:01:15 PM
గుడిహత్నూర్,(విజయక్రాంతి): జిల్లాలో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. గురువారం ఉట్నూర్ నుండి 70 మంది ప్రయాణికులతో బయలుదేరి ఆదిలాబాద్ వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సుపై గుడిహత్నూర్ మండలంలోని పూనగూడా వద్ద ఆకస్మికంగా చెట్టు విరిగి బస్సుపై పడింది. వెంటనే అప్రమత్తమైన బస్సు డ్రైవర్ రామ స్వామి బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులను సురక్షితంగా కాపాడాడు. ఈ ప్రమాదంలో బస్సు అద్దాలు ధ్వంసం కాగా, డ్రైవర్ రామ స్వామికి స్వల్ప గాయాలయ్యాయి.