అమరావతి: పులివెందుల సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాలను తప్పించే క్రమంలో ఆర్టీసీ బస్సు 30 అడుగుల లోయలోకి దూసుకెళ్లడంతో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటన జరిగిన సమయంలో పల్లె వెలుగు ఆర్టీసీ బస్సు కదిరి నుంచి పులివెందులకు వెళ్తోంది. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి, స్థానిక అధికారులు వెంటనే స్పందించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించగా, ఇద్దరు ప్రయాణికుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.