calender_icon.png 8 February, 2025 | 3:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఢిల్లీ నియోజకవర్గంలో ముగిసిన 9 రౌండ్లు..

08-02-2025 12:25:07 PM

న్యూఢిల్లీ,(విజయక్రాంతి): దేశవ్యాప్తంగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ఉత్కంఠ రేపుతుంది. ఢిల్లీ అసెంబ్లీ నియోజక వర్గంలో తొమ్మిదవ రౌండ్లు ముగిసింది. 9 రౌండ్ల తర్వాత ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వెనుకంజలో ఉన్నారు. కేజ్రీవాల్ పై బీజేపీ అభ్యర్థి పర్వేశ్ సాహిబ్ సింగ్ 1,170 ఓట్ల అధిక్యంలో కొనసాగుతున్నారు. ఢిల్లీ నియోజకవర్గంలో ఇంకా నాలుగు రౌండ్లు లెక్కించాల్సి ఉంది. కాల్ కాజీ స్థానంలో ఢిల్లీ సీఎం  అతిశీ 3,231 ఓట్ల వెనుకంజలో ఉండగా, బీజేపీ అభ్యర్థి రమేశ్ బిధూరి ఆధిక్యంలో ఉన్నారు. షాకూర్ బస్తీలో 18,863 ఓట్లతో ఆప్ అభ్యర్థి సత్యేంద్ర జైన్ వెనుకంజ,  గాంధీనగర్ లో ఆప్ అభ్యర్థి నవీన్ చౌధరిపై బీజేపీ అభ్యర్థి అర్విందర్ సింగ్ లవ్లీ 7,653 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో తొలి రౌండ్లలో బద్లీ స్థానం నుంచి ఆధిక్యంలో కనిపించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దేవేంద్ర యాదవ్ తర్వాత ఒక్కచోట కూడా అధిక్యంలో కనిపించలేదు. జంగ్ పురలో 2,438 ఓట్ల ఆధిక్యంలో మునీశ్ సిసోదియా ముందంజలో కొసాగుతున్నారు.