టెండర్ను రద్దు చేయాలి: ఐఎన్టీయూసీ
మంచిర్యాల, సెప్టెంబర్ 21 (విజయక్రాం తి): మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో ని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటు(ఎస్టీపీ పీ) కార్మికులు శనివారం ఆందోళన నిర్వహి ంచారు. ఎస్టీపీపీలోని క్యాంటీన్లో నాణ్య తా ప్రమాణాలు పాటించడం లేదని, కాం ట్రాక్టర్ కుళ్లిన ఆహారాన్ని అందజేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాంటీన్లో పదిహేను రోజులుగా ఈగలు వాలిన, చెడిపో యిన పదార్థాలతో, పురుగులు పడిన ఆలుగడ్డలతో వంటలు చేస్తున్నారని ఆరోపిస్తూ అధికారుల ఎదుట నిరసన వ్యక్తం చేశా రు. క్యాంటీన్ నిర్వహణ టెండర్ను రద్దు చేసి, కాంట్రాక్టర్ను సస్పెండ్ చేయాలని ఐఎన్టీయూసీ కార్మిక సంఘం నాయకులు కోరారు.