calender_icon.png 27 September, 2024 | 2:56 PM

కాన్పూర్‌కు రోహిత్ సేన

25-09-2024 12:00:00 AM

బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు

కాన్పూర్: బంగ్లాదేశ్‌తో రెండో టెస్టు ఆడేందుకు టీమిండియా మం గళవారం కాన్పూర్‌కు చేరుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ సహా మిగతా క్రికెటర్లు చెన్నై నుంచి కాన్పూర్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. మరోవైపు కా న్పూర్‌లో అడుగుపెట్టిన బంగ్లాదేశ్  ఎయిర్‌పోర్టు నుంచి హోటల్ రూం కు బయల్దేరి వెళ్లింది.

తొలి టెస్టు ఆడిన జట్టుతోనే రెండో మ్యాచ్‌కు సిద్ధమవుతున్న నేపథ్యంలో  బంగ్లా తో సిరీస్‌కు ఎంపికైన యువ క్రికెట ర్లు సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, యశ్ దయాల్.. ఇరానీ కప్ ఆడేందుకు బీసీసీఐ రిలీజ్ చేసే అవకాశ ముంది.