calender_icon.png 11 October, 2024 | 2:01 PM

రోహిత్ అనుమానమే!

11-10-2024 01:25:18 AM

న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు టీమిండియాకు షాక్ తగిలేలా ఉంది. నవంబర్ 22 నుంచి మొదలు కానున్న ఈ టెస్టు సిరీస్‌లో మొదటి టెస్టుకు కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండకపోవచ్చునని తెలుస్తోంది. తొలి రెండు టెస్టుల్లో ఏదో ఒకదానికి రోహిత్ దూరం అవనున్నాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. వ్యక్తిగత కారణాలతో రోహిత్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నాయి.