calender_icon.png 22 April, 2025 | 7:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బొమ్మ తుపాకితో బెదిరించి బార్ లో దోపిడీ..!

16-12-2024 08:06:25 PM

శేరిలింగంపల్లి (విజయక్రాంతి): బొమ్మ తుపాకితో బార్ సెక్యూరిటీని బెదిరించి నగదు అపహారించిన ఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నాలెడ్జ్ సిటీలోని తేవర్ బార్ అండ్ కిచెన్ లో పనిచేస్తున్న బార్ సెక్యూరిటీ అజిత్ సింగ్ ను బొమ్మ తుపాకీతో బెదిరించిన దుండగులు అతన్ని ఒక రూమ్ లో బంధించి రూ. 4,50000 నగదుతో పాటు ఒక ఆపిల్ ల్యాప్టాప్, ఒక ఐ ప్యాడ్ ను దుండగులు అపహరించారు. దోపిడీకి పాల్పడిన ఇద్దరు ఒరిస్సా రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. ఏ1శుభం కుమార్ ను అరెస్ట్ చేసి అతని వద్ద నుండి రూ.1,50,000తో పాటు, ఐ పాడ్, మాక్ బుక్ స్వాధీనం చేసుకున్నారు. ఏ2 నిందితుడు విశ్వజిత్ పండా పరారీలో ఉన్నాడు. ఒడిశాకు చెందిన వీరిద్దరూ నిందితులు గతంలో తేవర్ బార్ లో పనిచేశారు. పని సరిగా చేయడం లేదని ఉద్యోగం నుండి బార్ యాజమాన్యం తొలగించింది. ఇది మనసులో పెట్టుకుని తన రూమ్ మేట్ అయిన విశ్వజిత్ పండాతో కలిసి ఈ దోపిడీకి పాల్పడ్డారు. కేసు నమోదు చేసుకున్న రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.