సహకారం అందిచిన దాతలు
చేవెళ్ల, సెప్టెంబర్ 29: రోడ్డును బాగు చేయించాలని చేవెళ్ల మండలంలోని ఊరెళ్ల గ్రామస్తులు ఎమ్మెల్యే యాదయ్యతో పాటు అధికాలకు ఎన్నోసార్లు విన్నవించారు. అయినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. దీంతో గ్రామం నుంచి చేవెళ్లకు వెళ్లే గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం ఎవరో ఒకరు ప్రమాదాల బారిన పడి గాయపడుతున్నారు.
ఈ మార్గం గుండా సింగప్పగూడెం, రామ న్నగూడెంతో సహా 25 గ్రామాల ప్రజ లు రాకపోకలు సాగిస్తుంటారు. ఎమ్మెల్యే యాదయ్య సైతం తన సొంతూరు నుంచి చేవెళ్లకు ఇదే దారి గుండా వెళ్తుంటారు. మాజీ సర్పంచ్ మహ్మద్ జహంగీర్, మాజీ ఎంపీపీ కర్నె శివప్రసాద్ చొరవ తీసుకుని వంశీ బిల్డర్స్ అధినేతల సాయం కోరారు. వారు స్పందించి సహకారానికి ముం దుకొచ్చారు. ఆదివారం రహదారి పక్కన మొరం పోయించారు. చిన్న చిన్న మరమ్మతులు చేయించారు.