calender_icon.png 20 March, 2025 | 10:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాసబ్​ చెరువులోని రోడ్డు తొలగింపు

20-03-2025 02:16:21 PM

చెరువు కబ్జాపై గతంలో హైడ్రా కమిషనర్​కు ఫిర్యాదు

హైడ్రా, ఇరిగేషన్​, మున్సిపల్​ శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న చర్యలు

అబ్దుల్లాపూర్​మెట్​: రంగారెడ్డి జిల్లా, తుర్కయంజాల్​ మున్సిపాలిటీ మాసబ్​ చెరువు(Turkayamjal Municipality Masab Lake)లో అక్రమంగా వేసిన రోడ్డు హైడ్రా, ఇరిగేషన్, మున్సిపల్​ అధికారులు జేసీబీల సహాయంతో రోడ్డు తొలగించారు. తుర్కయంజాల్​ సర్వే నెంబర్​ 137లోని 320 ఎకరాల విస్తీర్ణంలో మాసబ్‌ చెరువుంది. బఫర్‌జోన్‌లో 200 ఎకరాలు. ఈ చెరువుకు సమీపంలో ప్రైవేటు పట్టాభూములు ఉండడంతో వాటిపక్కనే మా భూములూ ఉన్నాయంటూ కొందరు సుమారు  90 ఎకరాల వరకు చెరువును ఆక్రమించినట్లు తెలుస్తుంది. తుర్కయాంజాల్‌ మున్సిపాలిటీగా మారడం.. అదే విధంగా హైదరాబాద్​కు కూతపేట్టే దూరంలో ఉండడంతో ఇక్కడి భూములకు విపరీతమైన డిమాండ్​ పెరింగింది.  ఇండ్ల నిర్మాణాలు కూడా జోరుగా సాగుతున్నాయి.

దీంతో చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములను కూడా అక్రమార్కులు వదలడం లేదు. అందులో భాగంగానే మాసబ్​ చెరువు కబ్జాచేసి చెరువు మధ్యలోనుంచి రోడ్డు నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణాలపై హైడ్రా కమిషనర్​ రంగనాథ్​కు స్థానికులు పలుమార్లు ఫిర్యాదులు చేశారు. దీంతో హైడ్రా కమిషనర్​ మాసబ్​చెరువును పరిశీలించి.. చెరువులను ఆక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించి..  చెరువులోని నిర్మాణాలు తొలగించాలని సిబ్బందికి ఆదేశాలను ఇచ్చారు. ఆ నిర్మాణాలను తొలగించినా... ఇంతటితో ఆగకుండా మరల అక్రమార్కులు మాసబ్​ చెరువులో నిండుకుండాల నీళ్లు ఉన్నా... పెద్ద..పెద్ద బండరాళ్లతో, మోరంతో రోడ్డు పటిష్టంగా నిర్మించారు. మళ్లీ హైడ్రా అధికారులకు స్థానికులు ఫిర్యాదులు చేయడంతో హైడ్రా కమిషనర్​ రంగనాథ్​ ఆదేశాల మేరకు గురువారం హైడ్రా అధికారులు, ఇరిగేషన్​, మున్సిపల్​ అధికారులు మాసబ్​ చెరువులోని రోడ్డు తొలగించేశారు. ఈ కార్యక్రమంలో హైడ్రా అధికారులు, ఇరిగేషన్​ ఏఈ వంశీగౌడ్​, తుర్కయంజాల్​ మున్సిపల్​ అధికారులు పాల్గొన్నారు.