ఇల్లందు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో జరిగిన రెండు వేర్వేలు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందారు. టేకులపల్లి మండలం లాలుతండా వద్ద వేగంగా దూసుకొచ్చి కారు బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్య, భర్త మృతిచెందారు. మృతులను సంపత్ నగర్ కు చెందిన వారిగా గుర్తించారు. ఇల్లందు మండలం బొల్లినగర్ వద్ద ఆటో బోల్తా పడి ఒకరు మృతిచెందారు. మృతుడు భద్రతండాకు చెదిన సుమన్ గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.