calender_icon.png 28 October, 2024 | 12:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడారంకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం: మహిళ మృతి

29-05-2024 11:03:53 AM

దామెర : హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండ వద్ద బుధవారం రోడ్డుప్రమాదం జరిగింది. అదుపుతప్పిన ఆటో బోల్తాపడింది. ఈ ప్రమాదంలో మహిళ మృతి చెందగా, మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి మేడారం జాతరకు వెళ్తుండగా రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.