బెల్లంపల్లి (విజయ క్రాంతి): బెల్లంపల్లి నియోజకవర్గంలోని తాండూర్ మండలంలో ఫ్లై ఓవర్ బ్రిడ్జి పై మంగళవారం అర్ధరాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. బ్రిడ్జిపై ఆగి ఉన్న లారీని మరొక లారీ వేగంగా వచ్చే ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెంది క్యాబిన్లో ఇరుక్కున్నారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనలు చేరుకుని నేషనల్ హైవే అథారిటీ అధికారులకు సమాచారం అందించారు. ప్రమాదంలో మృతి చెంది క్యాబిన్ ఇరుక్కున్న డ్రైవర్ మృతదేహాన్ని వెలికి తీశారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు