హైదరాబాద్: నగరంలోని రాయదుర్గం బయోడైవర్సిటీ పై వంతెనపై సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. వాహనం ఢీకొని పై వంతెనపై నుంచి పడి బైకర్ మృతి చెందింది. మృతుడు రాయదుర్గం వాసి సుబ్బారావు (38)గా పోలీసులు గుర్తించారు. మృతడు బైకుపై అల్పాహారం విక్రయిస్తూ జీవిస్తాడని సమాచారం. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.