calender_icon.png 17 October, 2024 | 2:56 PM

ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన బైక్.. ముగ్గురు స్పాట్ డెడ్

17-10-2024 12:24:16 PM

వికారాబాద్ రూరల్ : వికారాబాద్ జిల్లాలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన బైకు అదుపుతప్పి పూడూరు గేటు వద్ద ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది.  ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన మరో వ్యక్తిని పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.  మృతులు పూడూరు మండలం మేడికొండకు చెందిన వారిగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.