అమరావతి: తిరుపతి జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎం కొంగరవారిపల్లి వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులు చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. పూతలపట్టు- నాయుడుపేట జాతీయ రహదారిపై ఈ ఘటన చోటుచేసుకుంది. నెల్లూరు నుంచి వేలూరుకు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని బాధితులు తెలిపారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.