calender_icon.png 24 October, 2024 | 3:55 PM

శంషాబాద్‌లో రోడ్డు ప్రమాదం.. ఒకరు స్పాట్ డెడ్

12-08-2024 11:12:52 AM

రాజేంద్రనగర్: శంషాబాద్ లో మరో రోడ్డు ప్రమాదం సంభవించింది. కొత్వాల్ గూడ ఔటర్ రింగు రోడ్డు సర్వీస్ రోడ్డులో బైక్ స్కిడ్ అయి వైడర్ కు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ఒకరి మృతి చెందగా, మరో వ్యక్తి కి తీవ్ర‌ గాయాలయ్యాయి. క్షగతాత్రున్ని చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. హోండా షైన్ వాహనం రాజేంద్రనగర్ నుండి ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డు మీదుగా శంషాబాద్ వైపు ప్రయాణిస్తుండగా కొత్వాల్ గూడ చెన్నమ్మ హోటల్ వద్దకు రాగానే అదుపు తప్పిన బైకు వైడర్ ఢీ కొట్టి స్తంభాన్ని ఢీ‌ కొట్టింది. తీవ్ర గాయాల‌ పాలై వ్యక్తి స్పాట్ లో ప్రాణాలు విడిచినట్లు సమాచారం. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.