మరొకరికి తీవ్ర గాయాలతో పరిస్తితి విషమం
సంగారెడ్డి, (విజయక్రాంతి)/ సదాశివపేట: సంగారెడ్డి జిల్లా సదాశివపేట బైపాస్ రోడ్డులో సోమవారం తెల్లవారుజామున జామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. నిద్రమత్తు, అతివేగంతో రోడ్డుపై నిలిచిఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. ఘట్కేసర్ నుండి మహారాష్ట్ర వెళ్తున్న లారీ టైర్ పంచర్ కావడంతో ఆ లారీని సదాశివపేట బైపాస్ రోడ్డుపక్కన నిలిపారు. 65వ జాతీయ రహదారిపై అతివేగం జాగ్రత్తతో డ్రైవర్ నడపడంతో నిలిపి ఉన్న లారీని ఢీకొట్టింది. లారీలో వున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. ఒక వ్యక్తి లారీ క్యాబిన్ లో ఇరుక్కుపోగా స్థానికులు 108 వాహన సిబ్బంది కలిసి అతనిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. సంఘటన స్థలానికి సదాశివపేట పోలీసులు చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. క్యాబిన్లో ఇరుకపోయిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.