మహేశ్వరం (విజయక్రాంతి): హైదరాబాద్ లోని మీర్పేట్లో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మీర్పేట్ పోలీస్స్టేషన్ పరిధిలో నందన వనం దగ్గర బైక్ ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టూవీలర్పై ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది...