లక్నో: ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ట్రాక్టర్, ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో పది మంది కూలీలు మృతి చెందారు. కచ్వా సరిహద్దు సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ట్రాక్టర్-ట్రైలర్ వారణాసి వైపు 13 మంది కార్మికులను తీసుకువెళుతుండగా, ఒక ట్రక్కు అదుపు తప్పి వెనుక నుండి ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.