శివంపేట: మెదక్ జిల్లా శివంపేట మండలం రత్నాపూర్లో బుధవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వచ్చి అదుపుతప్పిన కారు ఉసిరికపల్లి వద్ద రహదారిపై ఉన్న గుంతలో పడి గాల్లోకి ఎగిరింది. కారు రహదారిపై గుంత వల్ల ఎగిరి సమీపంలోని చెట్టును ఢీకొట్టింది. చెట్టును ఢీకొని పక్కనే ఉన్న కాలువలో కారు పడి ఏడుగురు మృతి చెందారు. ఉసిరికపల్లి నుంచి వెల్దుర్తి వరకు రహదారి విస్తరణ పనులు కొనసాగుతున్నాయి. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు బాలికలు ఉన్నారు. మృతులను పాముబండ తండాకు చెందిన వారిగా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నారు.