calender_icon.png 24 October, 2024 | 1:59 PM

బెంగుళూరు హైవేపై స్కూల్ బస్సు బీభత్సం

12-08-2024 11:24:11 AM

రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ బెంగుళూరు హైవేపై స్కూల్ బస్సు బీభత్సం సృష్టించింది. సాతంరాయి వద్ద రోడ్డు క్రాస్ చేస్తున్న పాదచారిని బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి గాల్లోకి ఎగిరి బస్సుపై పడ్డాడు. తీవ్రంగా గాయపడిన  పాదచారి ఘటనాస్థలిలోనే ప్రాణాలు విడిచాడు. డ్రైవర్ బస్సుతో పారిపోయి ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.