హెచ్ సియు వద్ద బస్సును ఓవర్ టేక్ చేస్తు ఆటోను ఢీ కొట్టిన కారు
డ్రైవర్ తో పాటు ముగ్గురికి గాయాలు..
శేరిలింగంపల్లి (విజయక్రాంతి): గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం అర్ధరాత్రి గచ్చిబౌలి నుండి లింగంపల్లి వైపు వెళ్తున్న ఓ కారు హెచ్ సియు వద్దకు రాగానే బస్సును ఓవర్ టేక్ చేయబోయి పక్కనే ఉన్న ఆటోని ఢీకొని అదుపుతప్పి పల్టీలు కొట్టిన స్విఫ్ట్ కారు. కారులో మొత్తం ముగ్గురు ప్రయాణిస్తున్నట్లు ప్రాథమిక సమాచారం, ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే కారులో ఇరుక్కున్న డ్రైవర్ ను అతికష్టం మీద బయటకు తీశారు. సమాచారం అందుకున్న గచ్చిబౌలి పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. కారులో మొత్తం డ్రైవర్ తో పాటు మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు తెలిపారు. కాగ డ్రైవర్ పరిస్థితి విషమం ఉండటంతో చికిత్స నిమిత్తం బీరంగూడ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. మద్యం మత్తులో కారును నడపడమే దీనికి ప్రధాన కారణమని పోలీసులు తెలిపారు. కారులో ఉన్న మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.